Wednesday, September 2, 2015

అత్యంత భక్తి శ్రద్ధలతో
అమ్మవారి చిత్రపటాన్ని
నగర సంకీర్తనలను గావిస్తూ భక్తులు కొందరు

ఊరిలోని వీధులన్నింటా కలయదిరుగుతున్నారు.

అమ్మ వారిని చూడగానే పసుపూ కుంకుమలతో
ప్రతినిత్యం సాక్షాత్కరించే నువ్వే గుర్తుకొచ్చావు.

అహ్టోత్తరశతనామాలతో స్తోత్రపాఠాలు వల్లించె భక్త
బృందంలో నువ్వున్నావేమోననిదీక్షగా వెదికాను.

నువ్వెక్కడా దర్శనమివ్వలేదు.అమ్మవారి
నవ్వులో నువ్వు దాగుంటావని తెలియక భ్రమకులోనయాను.

అమ్మ వారి పాదాలచెంత వినమ్రంగా తలను వాల్చి
మొక్కులు తీర్చుకుంటున్న భక్తిప్రసూనం నీవేకదా?

మనసునిండా సంతోష సాగరాలను నింపుకుని
వినయ విధేయతలతో ఇంటిముఖం పట్టాను.
===============================================

No comments:

Post a Comment