Thursday, August 27, 2015

ఒక దశాబ్దం క్రింద
-----------------
దరహాస చంద్రికలనన్నింటినీ
మన ఇంటి ద్వారబంధం వెనుక
దండెం పై ప్రేమపురస్సరంగా
వ్రేలాడదీసిన మధురాతి
మధుర క్షణాలు.
 ముఖద్వారం తోసుకుని
ముందుకు నడవగానే
ముసి ముసి నవ్వులతో
ముఖపరిచయాలు.
ముప్పిరిగొని ఉక్కిరి
 బిక్కిరిగావించి
ఊపిరాడకుండా చేసిన
 ఉత్తమ ఘడియలు.

గోడకు వేలా డుతూ నవ్వుతూ
పలకరిమంచే [మా నాన్న[గారి]
చిరుదరహాసాల చాయా చిత్రం.

ముందు వసారాలోకడుగిడగానే
పునర్దర్శన భాగ్యం ప్రాప్తిరస్తు
అంటూ దీవించిన సుహృన్మిత్రులు పుస్తకాల
పూర్ణచంద్రికల పూర్ణ కుంభపు స్వాగతాలు.
ఆగదివెనుకగా 108 రకాలపూలతో
 నీవుభక్తి పురస్సరంగా వల్లించిన
అష్టోత్తర శతనామాల సం రంభాల
లలితాదేవి,శ్రీలక్ష్మి అమ్మవార్లు
 దిటవుగా ఆశీర్వదించిన దీవెనల పరంపరలు.

ఆతరువాత జీవనసౌరభాన్ని కంఠ దఘ్నంగా
పంచిపె ట్టి   న ఆచార్యోత్తముల ప్రవచనల పరీరంభాలు.

ఓ పది అడుగులు ముందుకు పడగానే
మెట్టు మీద పేర్చిన ధాన్యం బస్తాల్లా
నీవు కట్టిన,కట్టవలసిన పట్టు మరియు
నేత చీరెల వరుస దొంతర్లు,,ఇనుప బీరువాలో
ఎక్కిడి తొక్కిడిగా పేచబడి   కలరావుండల మధ్యలో
నాసికాపుటాలను అదరగొట్టే  ఘుమాయింపులు.

ఆతరువాత వున్న శయనమందిరం,
రోజంతా కష్టపడిన శ్రమను మరపిస్తూ
ఆదమరచినిద్రపోయిన సుఖ నిద్రల ఆనవాళ్ళు.

ఒక వేకువ వెల్లువై గవాక్షాల్లోంచి ప్రవహించగానే
ముందున్న పాకశాలనుంచి పరుగులు తీసే ఆంధ్రాకాఫీ
పొగలు,సెగలుగక్కుతూ, గుబాళించే కాఫీకప్పులతో  కరచాలనాలు.
ఇప్పుడు ఓ దశాబ్దం తర్వాత అన్ని జ్ఞాపకాలూ రెండేళ్ళ క్రింద
నీ పరమద యానంతో కన్నీళ్ళమధ్యన మరుగున పడిపోతూ
క్రమేపీ మృగ్యమౌతున్న మధుర స్మృతుల మౌన భంగాలు.
=====================================
ఒక దశాబ్దం క్రింద
-----------------
దరహాస చంద్రికలనన్నింటినీ
మన ఇంటి ద్వారబంధం వెనుక
దండెం పై ప్రేమపురస్సరంఫా
వ్రేలాడదీసిన మధురాతి
మధుర క్షణాలు.
 ముఖద్వారం తోసుకుని
ముందుకు నడవగానే
ముసి ముసి నవ్వులతో
ముఖపరిచయాలు.
ముప్పిరిగొని ఉక్కిరి
 బిక్కిరిగావించి
ఊపిరాడకుండా చేసిన
 ఉత్తమ ధడియలు.

గోడకు వేలాదుతూ నవ్వుతూ
పలకరిమంచే [మా నాన్న[గారి]
చిరుదరహాసాల చాయా చిత్రం.

ముందు వసారాలోకడుగిడగానే
పునర్దర్శన భాగ్యం ప్రాప్తిరస్తు
అంటూ దీవించిన సుహృన్మిత్రులు పుస్తకాల
పూర్ణచంద్రికల పూర్ణ కుంభపు స్వాగతాలు.
ఆగదివెనుకగా 108 రకాలపూలతో
 నీవుభక్తి పురస్సరంగా వల్లించిన
అష్టోత్తర శతనామాల సం రంభాల
లలితాదేవి,శ్రీలక్ష్మి అమ్మవార్లు
 దిటవుగా ఆశీర్వదించిన దీవెనల పరంపరలు.

ఆతరువాత జీవనసౌరభాన్ని కంఠ దఘ్నంగా
పంచిపెట్తిన ఆచార్యోత్తముల ప్రవచనల పరీరంభాలు.
=====================================

Wednesday, August 26, 2015

అహంభో---
============

ఉరవడిగాదుముకుతూ ప్రవహించే
సెలయేటి ధాటికి కూడా కరగని
 కఠినాతి కఠినమైన
 గండ  శిలను నేను.

అంతరంగ మధనంలో
అంతుచిక్కని పదకేళిని.
వివేచనకు అర్ధం తెలుసుకోగలిగిన
వివేక చూడామణినికూడా నేనే.


ఆషాడభూతుల ఆదరణను కాదనుకుంఅహంభో---
============
ఉరవడిగా దుముకుతూ ప్రవహించే
సెలయేటి ధాటికి కూడా కరగని
 కఠినాతి కఠినమైన
 గండ  శిలను నేను.

అంతరంగ మధనంలో
అంతుచిక్కని పదకేళిని.
వివేచనకు అర్ధం తెలుసుకోగలిగిన
వివేక చూడామణినికూడా నేనే.

ఆషాడభూతుల ఆదరణను కాదనుకుంటూ
ఆత్మాశ్రయానందాన్నభవిస్తున్న అంతరాత్మను.
===================================

=================================

Tuesday, August 25, 2015

అశ్రు తర్పణం
----------------------
ఉరవళ్ళతో పరవళ్ళతో
గంగమ్మ
తన భక్తురాలిని
తనలో  నిమజ్జనం చేసుకోవాలని
ఆరాటపడుతూ
మరుక్షణమే ఐక్యం చేసుకోవాలని
హైరాన పడుతూ
-----------------------------------

Friday, August 21, 2015

పునీతo
===========
అతి ప్రాచీనంగానో
అత్యంత ఆటవికంగానో
ఇద్దరం దర్శనమిస్తుంటాం
నేనూ ధరిత్రిమాతా!!

పరిణామక్రమాన్నసురిస్తూ,
పరిభ్రమణలను కొనసాగిస్తూ


ఇరువురం ఎంతగా అలసి సొలసి పోయామో.
రూపు దిద్దుకుంటూ
రూపాన్ని సరిదిద్దుకుంటూ.

భూదేవి నన్ను తయారుచేసిది
తునాతునకలుగా విచ్చేలానూ చేసింది.
తుదకువిచ్చిన్నమూ గావించింది.
మరలా తనే నా పునరుజ్జీవనానికీ
 ఆస్కారాన్నందించింది.

ఎన్నెన్ని భ్రమణాలు?
ఎన్నీన్ని ప్రకంపనల పరంపరలు??
భూదేవి పవిత్ర గర్భంలోంచి
పరిపక్వమైన సుక్షేత్రంగా
ప్రభవించిన పునీతురాలిని నేను.
====================

Thursday, August 20, 2015

చేతుల్లో దిటవుగా పొదవి పట్టుకున్న పాత్రలోంచి
మధురాతి మధురమైన మధువు వొలికిపోయి
యేడాదులు రెండు గడిచాయట.

హృదయ సామ్రాజ్యాన్నేలుతున్న రసరమ్య గీతాన్ని
పాడుకోవడంకోసం తడుముకోవడం మొదలెట్టి
యేడాదులు రెండు యేకంగా గడిచిపోయాయట.

పూలాతోటలో విరబూసిన మూక్కలు ఎండకు తట్టుకోలేక
వాడుముఖం పెట్టి వల వలా యేడ్వడం ప్రారంభించి
సరిగ్గా రెండు గ్రీష్మాలు గడిచిపోయాయట.

నాప్రక్కనే వుంటూ అహోరాత్రాలూ శ్వాసించిన వెన్నెల చందమామ
నల్లటిమబ్బుల మధ్యకు జారిపోయి మసక బారడం మొదలెట్టి
రెండు శిశిరాలు దాటిపోయాయట.

ఇప్పుడు యే భక్తి గీతం నా హృదయకుహరాల్లో
ధ్వనించే అవకాశం మృగ్యం.
అష్టొత్తరాలూ శతనామాలు ఇక నా శ్రవణ పేయంగా
వినబడవని తీర్మానం జరిగిపోయింది.

ఇక ఒంటరితనన్ని ఒదిలోకి చేర్చుకుని మంచు  దుప్పటిని కప్పుకుని
శేషజీవితం గడుపుకోవడమే శ్రేయోదాయకమని
అక్షరసహ ఋజువయిపోయింది.

పాతకాలo లో తనకోసం రాసుకున్న ప్రణయగీతాలనే పదే పదే పాడుకోవడం తప్ప
 ఇంకా రాయగలిగిన గీతాలేం మిగిలిపోయి లేవని ఖాయమయింది.
============================================================
అంతర్వీక్షణం
------------------రావెల

ఆవిడ కన్నుల్లో
అనంతాంబరపు నీలి నీడలు  చూసిన గుర్తంటూ లేదుగాని
సం యమనానికీ సహనానికీ సోదాహరణంగానిలిచిన
సౌహార్దానికి సేతువయిన సమతుల్యతను మాత్రం చూసిన గుర్తు.

పరమపద సోపాన పటంలో నాలుగు దశాబ్దాలుగా
స్వయంకృషితో నిచ్చెనమెట్లను ఒక్కొక్కటిగా ఎక్కుతూ

నిగర్విగా, నిండుమనసుతో కన్నపిల్లలను,తల్లిదండ్రులనూ
అత్తామామలనూ అనురాగాభిమాన పురస్సరంగా మనుమలతో
మనుమరాండ్రతో తాదాత్మ్యంచెందుతూ పరవశించిన శుభ ఘడియలు మార్త్రమే
నా మనో ఫలకంపై ముద్రితమయ్యాయేగాని అనారోగ్యపు సరీసృపాలు
కాటేసి తీరుతాయన్న ఆలోచనగానీ, భయాందోళనలు గానీ పడినగుర్తులు మాత్రం
ఆమె వదనారవిందంలో గమనించిన జాడలు మాత్రం ససేమిరా చూసిన దాఖలాల్లేవు.
 ఎదుటివారి చిరాకు ఎంతటిదయినా చిరునవ్వుతో స్వీకరించి పరిష్కరించగల
సత్తా తనకుందని మాత్రం నాకు సంపూర్ణంగా విశ్వ్వాసమచంచలమైన నమ్మకం.

మల్లెపూవుకన్నా స్వచ్చంగా నవ్వగలిగిన తనకు నవ్వుల నజరానా నందించగలగడం
తప్ప మరేమీ ఇవ్వలేని నా వ్య్ధార్త యదార్ధ హృదయం ఘోషిస్తున్నది.

[[ ఆమె లేకుండా రెండేళ్ళు గడిచాయన్న ఆలోచనను అంతర్వీక్షణం చేసుకుంటూ]

Wednesday, August 19, 2015

జిగీష
---------------రావెల
==============================

అమ్మ ఎలావుంటుందో ఊహించుకోలేని ప్రాయం.
ప్రసవసమయంలో గుర్రపు వాతం వచ్చి
సరయిన వైద్య సౌకర్యాలులేని పల్లెలో
పరమపదించిందని మాత్రం తెలుసు.

అమ్మ చాల అందెగత్తెయని ఒక కులానికీ ఇంకొక మతానికీ
పట్టుబడని సౌహార్ద సేతువనీ అమ్మను గూర్చి

అందరూ ప్రశంసార్హంగా పలుకుమంతూడం మాత్రం విన్న గుర్తు.
యేకోణంలో అందంగా ఉంటుందో మూల్యాంకనంచేయలేని చిరుత ప్రాయం.

ఆరోజు పదకొండుగంటలప్పుడు స్కూలు ప్యూను వీరయ్య
మమ్మల్ను చంకలోవేసుకుని ఇంటిదగ్గర దీనంగా దిగాలుమొహంతో
దించిన గుర్తు మాత్రం మనో ఫలకంపై ముద్రితమై శాశ్వతత్వాన్ని
పుణికి పుచ్చుకుందని మాత్రం ఊహకందుతున్నది.

మొన్న చిన్నతమ్ముడు అకాస్మాత్తుగా అనారోగ్యంపాలై అసువులుబాశాడని తెలిసాక
అక్కయ్య బాధల బస్తీలో మంచానికేపరిమితమైన దశలో
వాడికి అమ్మ ఎలావుంటుందో తెలియని వయసులో అమ్మ అసువులు బాసింది.
ఒఇప్పుడు వాడూ అమ్మదగ్గరకెళ్ళాడని విలపిస్తూ అన్నం ముట్టడంలేదని ఎలిసాక
అమ్మను అక్కలో చూసుకునే యోగానికి దూరమైన మా దురదృష్టానికి పదే పదే
బాధపడుతూ--అంతక్రితం రెందు మూడురోజులముందే అక్కయ్యను చూడాలని
పట్టుబట్టి వెళితే అరేయ్ నీకొడుకు అచ్చం అమ్మలా వున్నడురా అని చెప్పుకుంటూ
మురిసిపోతున్న అక్కయ్య కళ్ళలో అమ్మను చూడగలనేమో నని తహ తహ లాడిన వేళ.



వీడు అచ్చు ఆడపిల్లలా పుట్టివుంటే బావుడేదని గజల్లు పాడిన సుపుత్రుడిని
అభినందిచిన డా/ సి.నా రె.పలుకులు మరలా వేదవాక్కులైశ్రవనానందంకలిగించిన మదురక్షణాలు
మళ్ళే కనుల  ముoదు సాక్షాత్కరించిన మధుర క్షణాలు గుర్తుకొచ్చి
పెదవులపై చిరుదరహాస చంద్రికలను చిరంతనంగా ముద్రించినవేళ.

అప్పటికాలంలో అమ్మ చాయాచిత్రం తీసిన నాధుడెవ్వరూ ఎందుకులేరొనన్న
మారుమూల పల్లె టూరి గుండె ప్రశ్నించిన తీరు విస్మయం కలిగించింది.

స్నానాలగదిలో చెవి దుద్దులో మంగళసూత్రాలో మరిచిపోయి నాన్నచేత
చిరునవ్వులతో చీవాత్లలమంటి మందలింపులను గుర్తు చేసుకుంటూ
ఉదయాన్నే లేవగానే కచ్చికతో పళ్ళుతోముకుని నుదిటన కుంకుం బొట్టుపెట్టుకుని
మంగళసూత్రాలను కళ్ళకద్దుకున్న అమ్మరూపమే మదిలో కదులుతూ కలవరపెడుతూన్న వైనం .
======================================================

Sunday, August 16, 2015

అస్తవ్యస్తంగా---
=====================



జలనిధులింకగాలేనిది
నాకనుకొలకుల్లో జీవనదుల్లా
ప్రవహించే ఈ కన్నీటిజలపాతాలకేం బిగువో
ఒక్కుదుటున ఇంకిపోవెందుకని?
సప్త సంద్రాలను అవలీలగా దాటివచ్చిన

సంతోషం సామ్రాజ్యం చేసినంతకాలం
సద్దుమణిగిపడివున్నాయ్ ఈ ధునులన్నీ
సంతాపం పరంపరగా చేరువవగానే
చిరంజీవుల్లా  చిరంతనం గుండె గొంతులో
గూడుకట్టుకుని నివసిస్తున్నాయ్.కదలిపోమని
భీష్మించుకు కూర్చున్నాయ్!



రెండేళ్ళ క్రిందటిదాకా వాటిజాడ మృగ్యమై వుండేవి
అప్పటినుంచీ ప్రారంభమై పట్టువీడకుండా వస్తున్నాయ్.
పోవడం మాట దేవుడెరుగు పొంచి పొంచిచూడడం
పొందికగా నేర్చుకున్నాయ్ !! వేదనలన్నింటికీ వేదికలుగా మారి వరుసపెట్టి వినిపించుకోకుండా మూకుమ్మడిగా వేధిస్తున్నాయ్.

చివరకుమిగిలేది ఇదేనా అని గడియపడని తలుపులవెనుక
తామతంపరగా పుట్టుకొస్తున్న పుట్టెడు ధు :ఖ తతికి
పూర్ణానుస్వారమై పొందికగా తిష్ట వేసి కూర్చుంటున్నాయ్.

విధిమాత్రం తానేం తక్కువ తినలేదనుకునేలా విషాద స్వరాభిషేకాన్ని వింత వింత సమయాల్లో వినిపించి విసుగును పుట్టిస్తూ తమ వైశద్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నది.

అస్తినాస్తి విచికిత్సాహెతువుల మధ్యన ఆశలు క్రమేపీ ఉడిగిపోతున్నాయ్ .. అంచులంటా అధోలోకానికి చేరుకుని
ఆశ్చర్యాన్ని మాత్రం మనకొదిలి అంతులేనికధగా
 అవరోధాల ఒడిలోకిజేర్చి విసుగూ విరామాల చెంతన విశ్రాంత
జీవన యానాన్ని కొనసాగిస్తూ మనలను కొనఊపిరితో
కొట్టు మిట్టాడే లా కుదేసి ముందుకు సాగిపోతున్నయ్.
=============================================




Saturday, August 15, 2015

రంగులు మార్చదు గానీ
హంగునకేంకొదువలేదు హరితపు ధాత్రిన్
చెంగున చెంగున ఎగురును
పింగళి వెంకయ్య సృష్టి పేర్మిని బడసెన్.
-------------
అరువది యెనిమిది దాటెను
ఇరువైపుల శత్రుసేన ఇరుకున బెట్టన్
తరుగని ఖ్యాతిని గాంచెను
పరువముకాపాడుకొనుచు పరుగులు దీసెన్.
----------------------------
బీదల క్షేమము తలచుచు
ఔదల బహుకీర్తి నెరపు విజ్ఞత నేర్చెన్
రాదగుకీర్తిని పొందెను
మీదుగమిక్కిలి ప్రేమసంపద నింపెన్. 

Monday, August 3, 2015

బాపుబొమ్మవోలె భాషించు చెలిమియే
కొత్తపుంతదొక్క కోరుకొనును
మనసు శాంతపరుచు మౌనమ్ము విడిపోవు
చెలిమికాడు చెంత చేరియున్న

Saturday, August 1, 2015

పలుకు పలుకున పులకించు కులుకు తీరు
చిరుదరహాసమాతడి సిరుల గనులు
జాతి హితమునె దలపోసి ఖ్యాతి గనెను
అతడులేడన్న మాటలు అశని పాటు
----------------
wings of fire
burning sins
of his countrymen!!
------------------
భువిని విడనాడి దివికేగె దివ్య సుమము
అతడి పాదాలచెంతనే ఇతడి వృత్తి
మనుజ తతిలోన మంచిని పెంచులాగు
రచనచేసెడు రీతిక రమ్యతరము
=======================
వెలుగుకేసి తిరిగి చూడు
వేదనంతా కరిగిపోతుంది
చీకటిలో వుండి తిట్టుకుంటుంటే
చిత్రవధేమిగులుతుంది.
-----------------------
నిద్రాణమై నిస్తేజంతో
నీరు గారిపోతున్న యువతలో
నిప్పును రగిలించి జ్ఞానాగ్నిని
రేకెత్తించిన ఘనాపాఠి
మతమేదైనా తన అభిమతం
జాతిహితమేనని ప్రకటించిన క్రాంతదర్శి.
విద్యార్ధుల హృదయ సీమల్లో దేశం పట్ల
ఓ అభిమానాన్ని ప్రేమనూ చదువులపట్ల
శ్రద్ధాసక్తులను రేకెత్తించిన సోమయాజి
ఎవ్వరు? ఇంకెవ్వరు?' భారతీయత ను
గౌరవించిన ఘటికావతంసుడు
అతడే మన అకళంకమౌ హృదయ పేటి
ఎవ్వరున్నారు
అతనికి సమీపానికి రాగల సరిపోలు జోడి.