Thursday, August 27, 2015

ఒక దశాబ్దం క్రింద
-----------------
దరహాస చంద్రికలనన్నింటినీ
మన ఇంటి ద్వారబంధం వెనుక
దండెం పై ప్రేమపురస్సరంగా
వ్రేలాడదీసిన మధురాతి
మధుర క్షణాలు.
 ముఖద్వారం తోసుకుని
ముందుకు నడవగానే
ముసి ముసి నవ్వులతో
ముఖపరిచయాలు.
ముప్పిరిగొని ఉక్కిరి
 బిక్కిరిగావించి
ఊపిరాడకుండా చేసిన
 ఉత్తమ ఘడియలు.

గోడకు వేలా డుతూ నవ్వుతూ
పలకరిమంచే [మా నాన్న[గారి]
చిరుదరహాసాల చాయా చిత్రం.

ముందు వసారాలోకడుగిడగానే
పునర్దర్శన భాగ్యం ప్రాప్తిరస్తు
అంటూ దీవించిన సుహృన్మిత్రులు పుస్తకాల
పూర్ణచంద్రికల పూర్ణ కుంభపు స్వాగతాలు.
ఆగదివెనుకగా 108 రకాలపూలతో
 నీవుభక్తి పురస్సరంగా వల్లించిన
అష్టోత్తర శతనామాల సం రంభాల
లలితాదేవి,శ్రీలక్ష్మి అమ్మవార్లు
 దిటవుగా ఆశీర్వదించిన దీవెనల పరంపరలు.

ఆతరువాత జీవనసౌరభాన్ని కంఠ దఘ్నంగా
పంచిపె ట్టి   న ఆచార్యోత్తముల ప్రవచనల పరీరంభాలు.

ఓ పది అడుగులు ముందుకు పడగానే
మెట్టు మీద పేర్చిన ధాన్యం బస్తాల్లా
నీవు కట్టిన,కట్టవలసిన పట్టు మరియు
నేత చీరెల వరుస దొంతర్లు,,ఇనుప బీరువాలో
ఎక్కిడి తొక్కిడిగా పేచబడి   కలరావుండల మధ్యలో
నాసికాపుటాలను అదరగొట్టే  ఘుమాయింపులు.

ఆతరువాత వున్న శయనమందిరం,
రోజంతా కష్టపడిన శ్రమను మరపిస్తూ
ఆదమరచినిద్రపోయిన సుఖ నిద్రల ఆనవాళ్ళు.

ఒక వేకువ వెల్లువై గవాక్షాల్లోంచి ప్రవహించగానే
ముందున్న పాకశాలనుంచి పరుగులు తీసే ఆంధ్రాకాఫీ
పొగలు,సెగలుగక్కుతూ, గుబాళించే కాఫీకప్పులతో  కరచాలనాలు.
ఇప్పుడు ఓ దశాబ్దం తర్వాత అన్ని జ్ఞాపకాలూ రెండేళ్ళ క్రింద
నీ పరమద యానంతో కన్నీళ్ళమధ్యన మరుగున పడిపోతూ
క్రమేపీ మృగ్యమౌతున్న మధుర స్మృతుల మౌన భంగాలు.
=====================================

No comments:

Post a Comment